నిజామాబాద్ జిల్లాలో దారుణం.. సర్పంచ్ పదవి కోసం.. కన్నకుమార్తెను హత్య చేసిన తండ్రి

Table of Content

సర్పంచ్ పదవి కోసం.. ఓ తండ్రి దారుణానికి తెగబడ్డాడు. ముగ్గురు పిల్లలు నిబంధన నేపథ్యంలో తనకు ఉన్న ముగ్గురు పిల్లల్లో ఒక కుమార్తెను హతమార్చాడు. ఎవరికీ అనుమానం రాకుండే ఉండేందుకు.. కుమార్తెను కెనాల్‌లో తోసి హత్య చేశాడు. మహారాష్ట్రకు చెందిన నిందితుడు.. తన కుమార్తెను నిజామాబాద్‌కు తీసుకువచ్చి మరీ చంపాడు. కేసు నమోదు చేసి విచారణ చేసిన పోలీసులు.. సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. అసలేం జరిగిందంటే?

సర్పంచ్ పదవిపై వ్యామోహం.. కన్న కుమార్తెనే చంపుకునేలా చేసింది. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన ఓ వ్యక్తికి ఆ రాష్ట్రంలో ముగ్గురు పిల్లలు ఉంటే సర్పంచ్‌గా పోటీ చేసేందుకు అనర్హులు అనే నిబంధన అడ్డు వచ్చింది. అయితే ఎలాగైనా సర్పంచ్ పదవిలో కూర్చోవాలని ఆరాటపడిన ఆ కసాయి తండ్రి.. కన్న పేగునే కడతేర్చాడు. అది కూడా మహారాష్ట్ర నుంచి తన కుమార్తెను తీసుకొచ్చి నిజామాబాద్‌లో కెనాల్‌లో తోసి చంపేశాడు. కెనాల్‌లో దొరికిన బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్‌పీ క్యాంప్ నిజాం సాగర్ శివారులోనీ డి 46/8 కెనాల్‌లో దొరికిన బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆ బాలిక మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముక్కెడ్ తాలూకా కేరూర్ గ్రామానికి చెందిన పాండు రంగ అనే వ్యక్తి కుమార్తె అని గుర్తించారు. మహారాష్ట్రలో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండొద్దు అనే నిబంధన ఉండటంతో ఎలాగైనా ఎన్నికల్లో నిలబడాలని నిర్ణయించుకున్న పాండు రంగ.. ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.సర్పంచ్ పోటీకి అనర్హుడిగా మారానని తన మిత్రుడు ప్రస్తుత కేరూర్ గ్రామ సర్పంచ్‌తో చెప్పడంతో అతడు ఈ సలహా ఇచ్చాడు. తన ఫ్రెండ్ సలహాతోనే తన పెద్ద కుమార్తెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో హంతకుడు పాండురంగ వెల్లడించాడు. దీంతో హత్య చేసిన పాండు రంగ, సలహా ఇచ్చిన గ్రామ సర్పంచ్ గణేష్ షిండేను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

ఇది చదవండి :  Telangana Government: సంక్రాంతి కానుకగా పల్లెలకు తెలంగాణ ప్రభుత్వ శుభవార్త.. గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్ల నిధులు విడుదల

ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలని.. తన పెద్ద కుమార్తె ప్రాచీని.. ఎడపల్లికి తీసుకొచ్చి ప్రాణాలతో ఉండగానే కెనాల్‌లోకి తోసి హత్య చేసినట్లు ఆమె తండ్రి పాండు రంగ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఇక నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆ బాలిక.. ఊపిరి ఆడక మృతి చెందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

Trending News

Editor's Picks

సమాజంలో జరుగుతున్న వాస్తవాలను ఎప్పటికప్పుడు వేగంగా, నిష్పక్షపాతంగా మరియు లోతైన విశ్లేషణతో ప్రజలకు అందించడమే Newsz9 ప్రధాన లక్ష్యం. తాజా రాజకీయాలు, సాంకేతికత మరియు సామాజిక అంశాలపై విశ్వసనీయమైన సమాచారం కోసం మీ నమ్మకమైన డిజిటల్ వార్తా వేదిక.

Must Read

©2026- All Right Reserved to NEWS Z9