Latest Posts

Telangana Government: సంక్రాంతి కానుకగా పల్లెలకు తెలంగాణ ప్రభుత్వ శుభవార్త.. గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్ల నిధులు విడుదల

సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం పల్లెలకు పెద్ద శుభవార్త వినిపించింది. గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్ల నిధులను విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను గ్రామాల్లో పారిశుధ్యం, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, చిన్నపాటి మౌలిక సదుపాయాల పనులకు వినియోగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల సమయంలో...
Read more

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త.. తిరుమలలో క్యూఆర్ కోడ్ పాదరక్షల కౌంటర్లు ప్రారంభం

తిరుమల శ్రీవారి భక్తులు ఎన్నాళ్లుగానో ఎదుర్కొంటున్న పాదరక్షల నిర్వహణ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షల నిర్వహణ కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఈ నూతన విధానంతో భక్తులకు ఇకపై చెప్పులు పోయాయా? దొరుకుతాయా? అనే ఆందోళన పూర్తిగా తొలగిపోనుంది. మంగళవారం రోజున టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి తిరుమలలో మొత్తం ఎనిమిది క్యూఆర్ కోడ్ పాదరక్షల కౌంటర్లను అధికారికంగా ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు?...
Read more

ఈ సమ్మర్‌లో ఏసీ కొనాలనుకుంటున్నారా? ఆలస్యం చేస్తే జేబుకు షాక్‌.. ధరలు భారీగా పెరిగే ఛాన్స్!

లాస్ట్ సమ్మర్‌లో ఏసీ కొనాలనుకుని వాయిదా వేసుకున్నారా? ఈ ఏడాది మాత్రం ఎలాగైనా ఏసీ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే రాబోయే నెలల్లో ఎయిర్ కండీషనర్ ధరలు గణనీయంగా పెరగబోతున్నాయి. ఇండియన్ రూమ్ ఎయిర్ కండీషనర్ మార్కెట్ పెద్ద మార్పు దశలోకి వెళ్తోంది. తయారీదారులు దాదాపు 7–8 శాతం వరకు ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఎనర్జీ ఎఫీషియెన్సీ నిబంధనలు, రా మెటీరియల్ ఖర్చుల...
Read more

తెలంగాణలో ‘అప్రకటిత ఎమర్జెన్సీ’: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ ధ్వజమెత్తారు

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మారుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష గొంతుకను అణిచివేసేందుకు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియాపై ఉక్కుపాదం: ‘ద్వంద్వ వైఖరి’పై ఆగ్రహం డిజిటల్ మీడియా మరియు సోషల్ మీడియా వేదికలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కేటీఆర్ తప్పుబట్టారు. కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని, బీఆర్ఎస్ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు...
Read more

తెలుగు రాష్ట్రాల్లో డేటా సునామీ.. ఒక్కో యూజర్ ఇన్ని జీబీలు వాడుతున్నారా? షాకింగ్ లెక్కలివే!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 5G ఇంటర్నెట్ విప్లవం వేగంగా విస్తరిస్తోంది. హై-స్పీడ్ డేటా సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజల జీవనశైలి పూర్తిగా మారుతోంది. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ నుంచి వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, వర్క్ ఫ్రం హోమ్ వరకు—ప్రతీ రంగంలో డేటా వినియోగం రికార్డు స్థాయికి చేరింది. ముఖ్యంగా మారుమూల గ్రామాల వరకూ నెట్‌వర్క్ విస్తరణ జరగడంతో తెలుగు రాష్ట్రాలు దేశ టెలికాం మ్యాప్‌లో కీలకంగా మారాయి. జియో ఆధిపత్యం.. డేటా వినియోగంలో దూసుకెళ్తోంది దేశవ్యాప్తంగా మొబైల్ డేటా...
Read more

ఆ ఊరికి తీరిన రోడ్డు కష్టాలు 55 ఏళ్ల నిరీక్షణకు ఎండ్ కార్డు

పార్వతీపురం మన్యం జిల్లాలోని కొత్తగళావల్లి గ్రామవాసుల ఎదురుచూపులు ఫలించాయి.55 ఏళ్ల వారి నిరీక్షణకు ఎండ్ కార్డు పడింది. సుమారుగా ఐదున్నర దశాబ్దాల తర్వాత కొత్తగళావల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర చొరవతో ఏడాది కిందట రహదారి నిర్మాణ పనులకు నిధులు మంజూరయ్యాయి. తాజాగా మంగళవారం నాటికి పనులు పూర్తికాగా.. గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్రం సిద్ధించి ఇన్నేళ్లు గడిచినా మన దేశంలో కనీస మౌలిక వసతులు కరువైన గ్రామాలు ఎన్నో....
Read more

ఇంటినుండే లేదా మీ కాళీ టైం లో సైడ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా ..? ఆ మార్గాలు ఇవే..!

ఉద్యోగం ఉంది… అయినా డబ్బు సరిపోవడం లేదా? ఇది ఈ రోజుల్లో చాలా మంది మధ్యతరగతి కుటుంబాల్లో వినిపించే సాధారణ మాట. జీతం వస్తోంది… కానీ అవసరాలు, ఖర్చులు, కలలు మాత్రం ఆ జీతాన్ని మించిపోతున్నాయి. ఫలితంగా – “ఇంకో మంచి ఉద్యోగం దొరికితే బాగుండేది” అనే ఆలోచన మనసులో తిరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే… సైడ్ ఇన్కమ్ గురించి సీరియస్‌గా ప్రయత్నించకపోవడం.ఉద్యోగం చేస్తూనే, రోజుకు కొద్ది గంటలు కేటాయించి...
Read more

ఆసియా కప్‌ ట్రోఫీ నుంచి బుమ్రా కామెంట్స్‌ వరకు.. 2025లో మేజర్‌ క్రికెట్‌ కాంట్రవర్సీలు ఇవే!

2025 ఏడాది క్రికెట్ పరంగా ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో పాటు, వివాదాలతో కూడా నిండిపోయింది. మైదానంలో ఆటతో పాటు మైదానం బయట చోటు చేసుకున్న సంఘటనలు ప్రపంచ క్రికెట్‌ను షేక్ చేశాయి. ఆసియా కప్ ట్రోఫీ డ్రామా నుంచి బుమ్రా వ్యాఖ్యల వరకు, ఈ ఏడాది చర్చనీయాంశంగా నిలిచిన ప్రధాన క్రికెట్ కాంట్రవర్సీలివే. ఆసియా కప్ ట్రోఫీ డ్రామా (Asia Cup Trophy Drama) ఇండియా మెన్స్ క్రికెట్ జట్టు ఆసియా కప్‌ను గెలుచుకున్నప్పటికీ, ట్రోఫీని స్వీకరించకుండా స్వదేశానికి...
Read more

ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం మంచిదా కాదా? వైద్యులు  చెప్పిన షాకింగ్ నిజాలు ఇవీ..! | health benefits of lemon water| benefits of lemon water

చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా ఉండటానికి, రోజంతా చురుగ్గా ఉండటానికి.. బరువు తగ్గడానికి.. శరీరంలో టాక్సిన్లు బయటకు పోవడానికి..  ఇలా ఒక్కొక్కరు ఒక్కో బెనిఫిట్ కోసం ఉదయాన్నే నిమ్మకాయ రసం నీరు తాగుతారు.  అయితే ఈ అలావాటు మంచిదేనా కాదా.. దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారు? తెలుసుకుంటే.. రోజూ...
Read more

కళ్ల ముందే ప్రపంచం.. కళ్ళజోడు లోనే సమస్తం | What is Jio Glass and what are its specifications| 5 cool things to know about Jio Glass| Jio Glass specifications| Reliance

సాంకేతిక రంగంలో మరో విప్లవానికి రిలయన్స్ సంస్థ తెరతీసింది. జియో ఇంటర్నెట్ తో లక్షలాది మంది వినియోగదారులను తన ఖాతాలో జమచేసుకున్న ఈ సంస్థ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన జియో గ్లాసెస్ డిజిటల్ ప్రపంచాన్ని కొత్త కోణంలో చూపించబోతున్నాయి. రిలయన్స్ సంస్థ 43న వార్షికోత్సవంలో జియో గ్లాస్ ను ఆవిష్కరించారు. ఈ కళ్లజోడుతో ఇప్పటివరకు అరచేతిలో ఇమిడిన ప్రపంచం ఇంక కంటి ముందు సాక్షాత్కరించబోతుంది. కరోనా వ్యాప్తి కారణంగా ప్రపంచమంతా డిజిటలైజ్ అయ్యిన తరుణంలో ఆన్...
Read more
1 7 8 9 10

Trending News

Editor's Picks

18 రోజుల తర్వాత బయటకు వచ్చిన అంబటి.. రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా సంచలన వ్యాఖ్యలు!

రాజమహేంద్రవరం/గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బుధవారం సాయంత్రం విడుదలయ్యారు. దాదాపు 18 రోజుల రిమాండ్ అనంతరం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు అధికారులు విడుదల ప్రక్రియను పూర్తి చేశారు. జైలు వెలుపల ఆయనకు వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. జైలు బయట అంబటి సంచలన వ్యాఖ్యలు: విడుదలైన అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శల...

ఏపీ 2024: ఓట్ల శాతం vs సీట్లు – ఈ ‘గ్యాప్’ వెనుక ఉన్న అసలు లెక్క ఇదే!

2024 ఎన్నికల ఫలితాలు వైఎస్సార్‌సీపీకి కోలుకోలేని దెబ్బ తీశాయి. అయితే, ఓట్ల శాతం పరంగా చూస్తే వైసీపీ పతనం అంత భారీగా ఏమీ లేదని గణాంకాలు చెబుతున్నాయి. కానీ, కూటమిగా ఏర్పడటం వల్ల ఆ ఓట్లు సీట్లుగా మారకుండా పోయాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విశ్లేషణ (175 సీట్లు): పార్టీ / కూటమి ఓట్ల శాతం (2024) గెలిచిన సీట్లు 2019తో పోలిక (ఓట్లు) TDP (తెలుగుదేశం) 45.60% 135 +6.43% పెరిగింది YSRCP (వైసీపీ) 39.37%...

ఏపీ 2024 ఎన్నికల వెనుక ‘మిస్టరీ’ ఉందా? ది వైర్ సంచలన కథనంపై ప్రత్యేక విశ్లేషణ!

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సాధించిన విజయం ఒక అద్భుతం (Miracle) అని కొందరు అంటుంటే, దాని వెనుక ఏదో ‘మాయాజాలం’ ఉందనే అనుమానాలను The Wire తన తాజా కథనంలో వ్యక్తం చేసింది. రాజకీయ విశ్లేషకుల మదిలో మెదులుతున్న కొన్ని కీలక ప్రశ్నలను ఈ కథనం ముందుకు తెచ్చింది. వ్యాసంలోని ప్రధానాంశాలు: ఓట్ల శాతంలో భారీ తేడా: కేవలం 5 ఏళ్లలో ఒక అధికార పార్టీ 151 సీట్ల నుండి 11 సీట్లకు...

లడ్డూ వివాదం: అది కల్తీ కాదు.. రాజకీయ కుట్ర! SIT దర్యాప్తుపై విపక్షాల ఎదురుదాడి

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం చుట్టూ అల్లుకున్న కల్తీ నెయ్యి వివాదం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపులు తిరుగుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు చర్య అని, భక్తుల మనోభావాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. విపక్షాల ప్రధాన వాదనలు: రాజకీయ ప్రేరేపిత దర్యాప్తు: సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న విచారణను కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా మలుచుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి....

టెక్నో పోవా కర్వ్ 2: 8000mAh బ్యాటరీతో ‘స్లిమ్’ బాహుబలి! ఐఫోన్ లుక్.. అదిరిపోయే ఆఫర్స్!

టెక్నో తన ‘పోవా’ సిరీస్‌లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ 5G ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని (Slimmest) కర్వ్డ్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపు పొందింది. ఎప్పుడు.. ఎక్కడ కొనాలి? (Sale Details): సేల్ తేదీ: ఈ నెల ఫిబ్రవరి 20, మధ్యాహ్నం 12 గంటల నుంచి. ఎక్కడ: ఎక్స్‌క్లూజివ్‌గా Flipkart లో మాత్రమే. కలర్స్: స్టామ్ టైటానియం, మెల్టింగ్ సిల్వర్, మిస్టిక్ పర్పుల్. ధర...

సమాజంలో జరుగుతున్న వాస్తవాలను ఎప్పటికప్పుడు వేగంగా, నిష్పక్షపాతంగా మరియు లోతైన విశ్లేషణతో ప్రజలకు అందించడమే Newsz9 ప్రధాన లక్ష్యం. తాజా రాజకీయాలు, సాంకేతికత మరియు సామాజిక అంశాలపై విశ్వసనీయమైన సమాచారం కోసం మీ నమ్మకమైన డిజిటల్ వార్తా వేదిక.

Must Read

©2026- All Right Reserved to NEWS Z9